ఈ మధ్య కాలంలో యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులలో సునిశిత్ ఒకరు.హీరోహీరోయిన్లపై, ప్రముఖ నటులపై చౌకబారు కామెంట్లు చేసి సునిశిత్ వార్తల్లో నిలుస్తున్నారు.
గతంలో ఒక సందర్భంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో తనకు పెళ్లైందని సునిశిత్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.లావణ్య త్రిపాఠి సునిశిత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు జైలులో పెట్టినా జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అతనిలో ఏ మాత్రం మార్పు రాలేదు.తాజాగా సునిశిత్ నందమూరి అభిమానులను హర్ట్ చేయగా నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సునిశిత్ ను ట్రోల్ చేశారు.
దీంతో సునిశిత్ కాళ్లబేరానికి వచ్చారు.సునిశిత్ తాజాగా ఒక వీడియోలో తాను నందమూరి హరికృష్ణ గురించి ఒక పోస్ట్ పెట్టానని ఆ పోస్ట్ వల్ల నందమూరి అభిమానులు హర్ట్ అయ్యారని తెలియడంతో ఆ పోస్ట్ ను డిలేట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఇకపై తాను టాలీవుడ్ కు చెందిన ఏ హీరోకు సంబంధించిన పోస్ట్ పెట్టనని సునిశిత్ చెప్పుకొచ్చారు.హీరోల అభిమానులను హర్ట్ చేసే పని తాను చేయనని హీరోలకు, హీరోల అభిమానులకు క్షమాపణ చెబుతున్నానంటూ సునిశిత్ వీడియోను విడుదల చేశారు.దివంగత నందమూరి హరికృష్ణ గురించి సునిశిత్ హద్దు మీరి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.తిక్కవేశాలు వేస్తున్న సునిశిత్ కు నందమూరి ఫ్యాన్స్ తిక్క కుదిర్చారు.
సునిశిత్ ఇకపై అయినా మారతారో లేదో చూడాల్సి ఉంది.నందమూరి హీరోల ఫ్యాన్స్ బాగానే బుద్ధి చెప్పడంతో సునిశిత్ కు బుద్ధి వచ్చిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతుండటం గమనార్హం.మరి సునిశిత్ నిజంగా మారతాడో లేదో చూడాల్సి ఉంది.గతంలో 1 నేనొక్కడినే సినిమాలో మొదట తానే హీరోనని సునిశిత్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.