గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.అయితే ఈ ఏడాదిలో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది అనుకునే లోపే మళ్ళీ ప్లాప్స్ ఎదురవుతున్నాయి.
ప్రేక్షకులు వచ్చిన సినిమాను వచ్చినట్టు ప్లాప్ చేస్తుండడంతో టాలీవుడ్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.ప్రేక్షకులు కరోనా తర్వాత పూర్తిగా మారిపోయారు.
ఎంతటి స్టార్ హీరో సినిమా అయిన సరే కంటెంట్ బాలేకపోతే మొహమాటం లేకుండా రిజక్ట్ చేసేస్తున్నారు.
అలాగే సినిమా టికెట్ రేట్స్ కూడా భారీ స్థాయిలో పెరగడం, ఓటిటీల ప్రభావం కూడా పెరగడం కూడా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రావడం లేదు.
దీంతో స్టార్ హీరోలు కూడా సెలెక్టివ్ కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు.ఇక ప్రేక్షకులు కూడా కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే కంటెంట్ లేని స్టార్ హీరోల సినిమాలు అయిన సరే చూడడం మానేస్తున్నారు.
ఆచార్యనే ఇందుకు ఉదాహరణ.
ఇక కాంతారా వంటి చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది.అంతే కాకుండా ఈ సినిమా ఎవరిదో తెలియక పోయిన సినిమాను సూపర్ హిట్ చేసిన 400 కోట్లు వసూళ్లు రాబట్టేలా చేశారు.
అలాగే మొన్న శుక్రవారం వచ్చిన సుధీర్ గాలోడు ఇప్పుడు కొత్త పాఠం నేర్పిస్తుంది.
ఈ సినిమాకు మౌత్ టాక్ లేకపోయినా.ప్రచారాలు సరిగ్గా చేయకపోయినా.వారం కూడా పూర్తి కాకుండానే మూడు కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.మరి అట్టట్ట ఉన్న ఈ సినిమాకే ప్రేక్షకులు ఈ రేంజ్ లో వసూళ్లను రాబట్టేలా చేస్తే.ఇక సరైన మాస్ బొమ్మ పడితే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
మాస్ మసాలా బొమ్మ పడితే కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం.అందుకే గాలోడు సినిమా మన వాళ్ళ కళ్ళు తెరిపించింది అని కామెంట్స్ వస్తున్నాయి.