ఆటో యూనియన్ స్థలం కోసం ఉపసర్పంచ్ కు వినతి పత్రం అందజేత..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో ఎల్లారెడ్డి పేట, సింగారం, నారాయణపూర్, బండ లింగంపల్లి, దుమాల, అక్కపల్లి, ముస్తాబాద్ మండలం కొండా పూర్ గ్రామంనకు చెందిన 500 మంది ఆటో డ్రైవర్ లు ఆటోలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఏదైనా సమావేశం కానీ చిట్టి కానీ నిర్వహించుకోవాలని అనుకుంటే ఇబ్బందవుతుందని తమకు ఆటో యూనియన్ భవన నిర్మాణం కోసం రెండు గుంటల ప్రభుత్వ స్థలము ఇప్పించాలని కోరుతూ స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ కు సుమారు 100 మంది ఆటో కార్మికులు వినతి పత్రం సమర్పించారు.

ఇట్టి విషయం సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కి, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు.

ఆమె వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News