హైదరాబాదీలను విపరీతంగా ఆకట్టుకుంటున్న సుబ్బయ్య గారి బుట్ట ఈ బుట్టలో 12 ఐటెంమ్స్‌

మొన్నటి వరకు ఆంధ్రాకే పరిమితం అయిన సుబ్బయ్య గారి వంటలు తాజాగా హైదరాబాద్‌ వచ్చాయి.దాదాపు 60 ఏళ్లుగా సుబ్బయ్య గారి హోటల్‌ ఆంధ్రా భోజన ప్రియులకు రుచికరమైన భోజనంను అందిస్తుంది.

అత్యంత పరిశుబ్రమైన వంటకాలు అందించడంతో పాటు, రుచికరమైన భోజనం సుబ్బయ్య గారి హోటల్‌ ప్రత్యేకత.1950 నుండి ప్రకాశం జిల్లా కాకినాడలో కొనసాగుతూ వస్తున్న సుబ్బయ్యగారి హోటల్‌కు ఏపీలో పలు బ్రాంచీలు ఏర్పాటు చేశారు.అయితే హైదరాబాద్‌లో మాత్రం ఇప్పటి వరకు బ్రాంచీ లేదు.తాజాగా హైదరాబాద్‌ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్‌ నెం.4లో కొత్త బ్రాంచీని ప్రారంభించడం జరిగింది.సుబ్బయ్యగారి హోటల్‌ అంటూ ఇప్పటి వరకు నెట్‌లో చూడటం, టీవీల్లో చూడటమే.

మొదటి సారి హైదరాబాదీలకు సుబ్బయ్యగారి వింధు భోజనం దక్కింది.దాంతో ప్రస్తుతం సుబ్బయ్య గారి హోటల్‌కు జనాలు క్యూ కడుతున్నారు.

సుబ్బయ్య గారి బుట్ట మీల్స్‌ ప్రస్తుతం హైదరాబాదీల్లో తెగ చర్చ జరుగుతుంది.ముగ్గురు భోజనం చేయాలంటే బుట్ట మీల్స్‌ను ఆర్డర్‌ చేస్తే సరిపోతుంది.

రూ.315 లకు బుట్ట మీల్స్‌ వస్తుంది.ఆ బుట్ట మీల్స్‌లో 12 రకాల వంటకాలు ఉంటాయి.

Advertisement

స్వీటు నుండి అప్పడం కూరలు, పప్పు, సాంబార్‌ ఇలా 12 రకాలతో కడుపు నిండా తినే విధంగా ఉంటుంది.కాస్త తక్కువ తినే వారయితే ఈ బుట్ట భోజనంను నలుగురు కూడా తినవచ్చు.

ఇక సింగిల్‌ అయితే 105 రూపాయలు, ఇద్దరు తినాలంటే 210 కి ఫుల్‌ మీల్స్‌ వస్తుంది.సబ్బయ్య గారి హోటల్‌లో ప్రతి రోజు 40 నుండి 50 రకాల వంటలు వండుతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.

కాకినాడలో ఉన్నట్లుగానే చాలా పరిశుబ్రమైన ఆహారంను హైదరాబాదీలకు అందిస్తున్నట్లుగా సుబ్బయ్యగారి వారసులు అంటున్నారు.మీరు హైదరాబాద్‌లో ఉంటే ఒకసారి సుబ్బయ్య గారి బుట్టను తెచ్చుకోండి.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు