విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.త్వరలోనే తన ఎంపీ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నారు.
ట్విట్టర్ ద్వారా రాజీనామా విషయాన్ని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.చంద్రబాబుకు, పార్టీకి తన అవసరం లేదని భావించిన తరువాత కూడా ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కానద్నారు.
ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మరుక్షణమే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ట్వీట్ లో వెల్లడించారు.
అయితే తిరువూరు సభ నిర్వహణ బాధ్యతలను పార్టీ అధిష్టానం కేశినేని చిన్నికి అప్పగించింది.దాంతో పాటు కేశినేని నాని ఎటువంటి పార్టీ వ్యవహారాల్లో కల్పించుకోవద్దని అధిష్టానం సూచించిందని పార్టీ నేతలు తెలిపారని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ముఖ్యనేతలు, అనుచరులతో సమావేశమైన కేశినేని నాని రాజీనామా చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో భాగంగా కేశినేని ఏదైనా పార్టీలో చేరతారా? లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.