తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ కీలక సందేశం విడుదల చేశారు.

తెలంగాణ ప్రజల మధ్యకి రాలేకపోయినా ప్రజల హృదయాలకు చేరువయ్యానన్న సోనియా గాంధీ ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

ఈ క్రమంలో దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చాలన్నారు.ఈ మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు.

మార్పు కావాలి.కాంగ్రెస్ రావాలి అని తెలిపారు.

తెలంగాణ అమరవీరుల కల నెరవేరాలన్న సోనియా గాంధీ నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.

Advertisement
ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?

తాజా వార్తలు