ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు(Somuveerraju) జనసేన పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు.నేడు పదవ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.”ప్రజా సమస్యల పరిష్కారమే పునాదులుగా రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన.జనసేన పార్టీ(Janasena Party) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు”.
ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.దీంతో సోమువీర్రాజు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతూ ఉంది.
మచిలీపట్నంలో నేడు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కాబోతున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి వారాహి వాహనం ద్వారా వేదిక పైకి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు.ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో… పవన్ కళ్యాణ్ ఈ సభలో ఏ విధంగా ప్రసంగిస్తారు అన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.