మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) హీరోగా జీతూ జోసెఫ్(Jeetoo Joseph) దర్శకత్వంలో వచ్చిన దృశ్యం రెండు భాగాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ రెండు భాగాలు కూడా తెలుగు మరియు హిందీ భాషల్లో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ప్రస్తుతం మూడవ భాగం కు సంబంధించిన వర్క్ జరుగుతుంది.గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి మూడు భాషల్లో కూడా ఒకే సారి జీతూ జోసెఫ్ చిత్రీకరణ జరపాలని భావిస్తున్నారు.
దాంతో బడ్జెట్ తగ్గడంతో పాటు చాలా విషయాలు కలిసి వస్తాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న దృశ్యం 3(drishyam 3) సినిమా కు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఒరిజినల్ మూవీ లో మోహన్ లాల్ నటించగా రీమేక్ లో వెంకటేష్ మరియు అజయ్ దేవగన్(Ajay Devgn) దృశ్యం రిమేక్ ల్లో నటించబోతున్న విషయం తెలిసిందే.
![Telugu Ajay Devgn, Drishyam, Jeetoo Joseph, Mohan Laal, Telugu, Venkatesh-Movie Telugu Ajay Devgn, Drishyam, Jeetoo Joseph, Mohan Laal, Telugu, Venkatesh-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/03/mohan-laal-drishyam-3-movie-remake-in-telugu-and-hindhi-at-a-timeb.jpg)
తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా ఒకేసారి చిత్రీకరణ జరపడంతో జీతూ జోసెఫ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.వెంకటేస్ ప్రస్తుతం ఒక సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిన తర్వాత దృశ్యం చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.
మీనా ఎప్పటిలాగే ఈ సీక్వెల్ లో కంటిన్యూ అవ్వబోతోంది.ఈ మూడవ పార్ట్ కు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.వెంకటేష్ ఇప్పటి వరకు నటించిన రెండు దృశ్యం సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో మూడవ పార్ట్ పై అంచనాలు ఆయన అభిమానుల్లో పెరిగి పోతున్నాయి.జీతూ జోసెఫ్ యొక్క గత చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా దృశ్యం 3 పై అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
గత రెండు పార్ట్ ల్లో ఉన్న సస్పెన్స్ కి మూడవ పార్ట్ లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.ఒక హత్య చుట్టు తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.
ఆ హత్య కేసు మూడవ పార్ట్ లో ఒక ముగింపుకు వస్తుందేమో చూడాలి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే దృశ్యం 3 వస్తుందేమో.