షణ్ముఖ్ జస్వంత్ అనే ఈ యూట్యూబర్ గురించి సోషల్ మీడియా ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈయన పరిచయం అందరికీ తెలిసిందే.
నిజానికి ఏ టాలీవుడ్ హీరోల పేర్లు కూడా అంతా చర్చలు జరుగుతాయో లేదో తెలియదు కానీ ఈ షణ్ముఖ్ పేరు మాత్రం ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా మోత మోగింది.
మొదట సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షణ్ముఖ్ మొత్తానికి ఓ సెలబ్రెటీ హోదాను అందుకున్నాడు.
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసి తక్కువ సమయంలో మంచి సక్సెస్ అందుకొని యూట్యూబ్ స్టార్ గా నిలిచాడు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పరిచయం పెంచుకున్నాడు.
నిజానికి ఈయన బిగ్ బాస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఏకంగా తన మంచి జీవితానికి.చెరుగని మచ్చ ముద్రించుకున్నాడు.
పైగా తన అభిమానుల నుండి నెగటివ్ నిద్ర వేసుకున్నాడు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం మరో కంటెస్టెంట్ సిరి తో ఆయన ఎలా గడిపాడో చూసాం.
ఆయనకు మరో సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన తో మంచి ప్రేమ రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక వీరిద్దరూ పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.పైగా బుల్లితెరపై ప్రసారమైన పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేశారు.నిజానికి ఈ జంటని చూస్తే చాలు లవ్ చేసుకునే కపుల్స్ ఇంత క్యూట్ గా ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారు అని కూడా వార్తలు వినిపించాయి.

కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ లో సిరి తో చేసిన రాద్ధాంతం వల్ల.పూర్తిగా అతడికి దూరంగా ఉండటం మంచిది అని ఫిక్స్ అయింది దీప్తి.దీంతో అతడు హౌస్ నుండి బయటికి రాగానే అతడికి బ్రేకప్ చెప్పేసింది.
ఇక వీరి బ్రేకప్ ని చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.ఇక ఇదంతా పక్కన పెడితే.
ఇప్పుడు ఎవరి దారి వారు అన్నట్లు బిజీ లైఫ్ లో గడుపుతున్నారు.
నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటారు.
ఇక షణ్ముఖ్ ఇటీవలే ఓ వెబ్ సిరీస్ తో కూడా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా షణ్ణుకు అనారోగ్యం బాలేదని తెలిసింది.
ఇక ఈ విషయాన్ని తానే తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.అయితే తన బర్త్డే మంత్ ఇదే అని దాంతో తనకు దిష్టి తగిలింది అంటూ.
అందుకే తనకు హెల్త్ బాగోలేదు అని ఒక పోస్ట్ పెట్టడంతో అది బాగా వైరల్ అయ్యింది.ఇక తాజాగా తనకు రికవరీ అయినట్లు తెలుస్తుంది.







