టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి సిట్ అధికారులు చేరుకోనున్నారు.
ఇవాళ్టి విచారణలో భాగంగా ఛైర్మన్ జనార్దన్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ రికార్డు చేయనుంది.మరోవైపు ఈ కేసులో ముగ్గురు నిందితుల ఐదు రోజుల కస్టడీ ముగిసింది.
రమేశ్, షమీమ్ లతో పాటు సురేశ్ లను సిట్ అధికారులు విచారించారు.కస్టడీ ముగియడంతో నాంపల్లి కోర్టుకు తరలించారు.