ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సాగుతున్న సిట్ సోదాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతో పాటు హైదరాబాద్ లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 Sit Investigations Are Going On In Mla Purchase Case-TeluguStop.com

ఏడు బృందాలుగా విడిపోయిన సిట్ అధికారులు సోదాలు చేపట్టారు.హర్యానా, కర్ణాటకలోని రామచంద్రభారతి నివాసాలలో తనిఖీలు చేస్తున్నారు.

తిరుపతిలోని సింహయాజీ స్వామిజీకి చెందిన ఆశ్రమంలో, హైదరాబాద్ లో నందకుమార్ ఇల్లు, హోటల్ లో సోదాలు నిర్వహిస్తున్నారు.అదేవిధంగా కేరళలోని కొచ్చిలో ఓ వైద్యుని ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఈ వైద్యుడు రామచంద్ర భారతికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.ఈ తనిఖీలలో పలు కీలక పత్రాలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తులో ఇంకా ట్విస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube