టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ ముగ్గురు నిందితులను కస్టడీకి కోరుతూ సిట్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నిందితులు ప్రశాంత్, తిరుపతయ్య, రాజేందర్ ను వారం రోజులపాటు కస్టడీకి అనుమతించాని పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు.ఈ నేపథ్యంలో పోలీస్ కస్టడీ పిటిషన్ పై ఈనెల 31న నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.







