తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం శృతి వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉంది.
ఇది ఇలా ఉంటే శృతిహాసన్ కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటుంది.ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సినిమాలకు సంబంధించిన విషయాల గురించి వ్యక్తిగత విషయాలు గురించి పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఇటీవలే ఆమె ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను చేసింది.
ఆ పోస్ట్ ని సరిగ్గా చదవని యూట్యూబ్ చానల్స్ వారు ఆ పోస్టుతో రచ్చ రచ్చ చేయడంతో అదే విషయంపై క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని విడుదల చేసింది శృతిహాసన్.
అయితే యూట్యూబ్ ఛానల్స్ వారు చేసిన హంగామా తో ఆమె హాస్పిటల్లో చేరింది అని ఫ్రెండ్స్ కంగారు పడ్డారట.తాజాగా అదే విషయం గురించి ఆమె స్పందిస్తూ…నేను బాగానే ఉన్నాను.
నేను హాస్పిటల్ లో అడ్మిట్ కాలేదని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది కదా అని తెలిపింది శృతిహాసన్.ఆమె చాలా ఏళ్లుగా PCOD అనే సమస్యతో బాధ పడుతోంది.
ఆ విషయాన్నీ తెలుపుతూ ఒక వర్కౌట్ వీడియోని షేర్ చేసింది.
ఇలా చేస్తే తనలా ఆ సమస్యని ఎదుర్కొనే ఆడవాళ్ళకి కొంత మేలు జరుగుతుందని ఆమె రాసింది.కానీ, ఆమె ఎదో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, దానికోసం ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లుగా కొన్ని మీడియా సంస్థలు హడావిడి చేసి, లేని పోనీ వార్తలను సృష్టించాయట.దాంతో ఆమె ఇలా వివరణ ఇచ్చింది.
కాగా ప్రస్తుతం శృతి హసన్ సలార్ తో పాటు బాలకృష్ణ, చిరంజీవి కొత్త చిత్రాల్లో కూడా నటించబోతున్న విషయం తెలిసిందే.