కమల్ గారాలపట్టి శృతి హాసన్ కొన్నాళ్లు తెలుగులో సినిమాలు చేయకుండా గ్యాప్ ఇచ్చింది.కానీ మళ్లీ వకీల్ సాబ్, క్రాక్ సినిమాలతో తిరిగి ఫాం లోకి వచ్చింది.
ఇక ఈ సంక్రాంతికి వస్తున్న వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో కూడా శృతి హాసన్ నటించింది.ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి.
రెండు సినిమాలను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి రెండిటికి కలిపి అమ్మడి రెమ్యునరేషన్ మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది.
ఇక ఇదిలాఉంటే రీసెంట్ గా జరిగిన వీర సింహా రెడ్డి ఈవెంట్ లో శృతి హాసన్ శారీ లుక్స్ తో అదరగొట్టేసింది.
సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడమే కాకుండా బ్లాక్ శారీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది శృతి హాసన్.అమ్మడు మెరుపులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.శృతి హాసన్ లుక్స్ గురించి ఈవెంట్ లో స్పెషల్ గా మాట్లాడుకునేలా చేసింది.ఈ దెబ్బతో శృతి హాసన్ మళ్లీ తెలుగులో ఫుల్ ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు.
ఇవే కాకుండా ప్రభాస్ సలార్ లో కూడా ఆమె నటిస్తుందని తెలిసిందే.వీర సింహా రెడ్డి ఈవెంట్ లో లుక్స్ తోనే కాదు తన స్పీచ్ తో కూడా అలరించింది అమ్మడు.