కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కేవలం సినిమాల్లో నటించడమే కాదు అతనికి డైరెక్షన్ అన్నా కూడా చాలా ఇష్టం.ఇప్పటికే పవర్ పాండి అనే సినిమాను డైరెక్ట్ చేసిన ధనుష్ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ధనుష్ డైరెక్షన్ లో రుద్ర అనే సినిమా అంతకుముందు ప్లాన్ చేశాడు.కింగ్ నాగార్జున, అరవింద్ స్వామి తో పాటుగా ధనుష్ కూడా ఈ సినిమాలో నటించాలని అనుకున్నారు.
కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు పడలేదు.
ఇక ఫైనల్ గా మరోసారి ఆ సినిమాను తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు ధనుష్.
నాగార్జున, అరవింద స్వామితో బదులుగా విష్ణు విశాల్, ఎస్.జె సూర్యలను తీసుకున్నారట.ధనుష్ ఈ సినిమా కథను చాలా ఇష్టంతో రాసుకున్నట్టు తెలుస్తుంది.ధనుష్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సెకండ్ సినిమా పై చాలా హోప్స్ తో ఉన్నాడు.
మరి ఓ పక్క హీరోగా అదరగొడుతూనే డైరెక్టర్ గా ధనుష్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు.ధనుష్ ప్రస్తుతం తెలుగులో సార్ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే.