సికింద్రాబాద్ పరిధిలో రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప సభాపతి శ్రీ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పరిధిలో ని చిలకలగూడ, బడీ మజీద్, చోటీ మజీద్, మెట్టుగూడ డివిజన్ పరిధిలోని హమాలి బస్తీ లైన్ బజార్ మస్జిద్ లలో రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఉప సభాపతి శ్రీ పద్మారావు గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని ఐదు మునిసిపల్ డివిజన్లలో దాదాపు 16 మసీదులకు రంజాన్ కానుకలు లభించేలా ఏర్పాట్లు జరిపామని, ఇఫ్తార్ విందుకు నిధులను కుడా ప్రభుత్వ పరంగా సమకుర్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

తెలంగాణా రాష్ట్రం అవిర్భావించాకే అన్ని మతాల పండుగలకు సమాన ప్రాముఖ్యత లభిస్తోందని అన్నారు.కార్పొరేటర్లు కుమారి సామల హేమ, రాసురి సునిత, తెరాస యువ నేత శ్రీ తీగుల్ల రామేశ్వర్ గౌడ్ తదితరులతో పాటు వివిధ మజీదుల ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

తాజా వార్తలు