ఇందిరా దేవి మహేష్ ను అలా పిలిచేవారట.. తల్లిపై మహేష్ కు ఎంత ప్రేమంటే?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్త అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.

గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఇందిరా దేవి తన నివాసంలో మృతి చెందారు.

ఇందిరా దేవి మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తుండటం గమనార్హం.తల్లి మరణ వార్త తెలిసి మహేష్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు.

మహేష్ బాబును తల్లి ఇందిరా దేవి నాని అని పిలిచేవారని సమాచారం.గతంలో ఏ ఇంటర్వ్యూలో అయినా తల్లి ప్రస్తావన రాగానే మహేష్ బాబు ఎమోషనల్ అయ్యేవారు.

ఇందిరా దేవి కృష్ణకు మొదటి భార్య కాగా ఆమె మామ కూతురు కావడం గమనార్హం.కృష్ణ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సూచనల మేరకు ఇందిరా దేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది.

Advertisement

కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఇందిరా దేవి అరుదుగా మాత్రమే బయటకు వచ్చేవారు.ఏప్రిల్ 20వ తేదీన ఇందిరా దేవి పుట్టినరోజు కాగా ఆరోజు మహేష్ సోషల్ మీడియా వేదికగా అమ్మా మీరు నా తల్లి కావడం అదృష్టమని మీ గురించి చెప్పడానికి ఒక్కరోజు సరిపోదని పేర్కొన్నారు.

ఎప్పటికీ నిన్ను లవ్ చేస్తూనే ఉంటానని మహేష్ ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.తన ట్వీట్ ద్వారా మహేష్ బాబు తల్లిపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.

ఈ ఏడాది జనవరిలోనే రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే.

రమేష్ బాబు మరణాన్ని మరవక ముందే ఇందిరా దేవి మరణించడం అభిమానులను మరింత బాధ పెడుతోంది.దుఃఖంలో ఉన్న మహేష్ ఫ్యామిలీకి దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.ఇందిరా దేవి మరణంతో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు