టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో కాంతారావు ఒకరనే సంగతి తెలిసిందే.సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామానికి చెందిన కాంతారావు అన్ని జానర్ల సినిమాలలో నటించి సక్సెస్ లను సొంతం చేసుకున్నారు.
కాంతారావు గారికి ఎన్నో అవార్డులు వచ్చాయి.అయితే ఆయన వారసులు మాత్రం ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారనే సంగతి తెలిసిందే.
కొన్నిరోజుల క్రితం కాంతారావు వారసులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే కాంతారావు ఆస్తుల గురించి ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన కూతురు స్పందిస్తూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాంతారావు కూతురు సుశీల మాట్లాడుతూ హీరోయిన్ల పిచ్చి వల్లే నాన్న డబ్బులు పోగొట్టుకున్నాడని జరిగిన ప్రచారంలో నిజం లేదని అన్నారు.
హీరోయిన్లకు అడగాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
మా ఫాదర్ కు అమ్మాయిల పిచ్చి అస్సలు లేదని సుశీల కామెంట్లు చేశారు.ఆయనకు తెలిసిన ప్రపంచం సినిమా ప్రపంచం అని ఆమె పేర్కొన్నారు.
నాన్న సరైన విధంగా పెట్టుబడులు పెట్టలేదాని సుశీల తెలిపారు.రెండు పెగ్గులు మద్యం తీసుకునేవారని ఆమె చెప్పుకొచ్చారు.
నాన్నకు క్యాన్సర్ అని మాకు తెలిసినా ఆయనకు చెప్పలేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఆయన బర్త్ డే ఉంటే ఫ్రెండ్స్ ను కచ్చితంగా పిలిచేవారని ఆమె అన్నారు.నాన్న షుగర్ పేషెంట్ అని సుశీల తెలిపారు. అపోలోలో స్కాన్ చేయించిన సమయంలో నాన్నకు క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
సుశీల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.