శివుడికి దేనితో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుంది?

మనకు తెలిసినంత వరకు శివుడు అభిషేక ప్రియుడు.అందుకే ఎక్కువగా శివుడికి అంటే శివ లింగానికి అభిషేకాలు జరిపిస్తుంటాం.

సోమ వారాల్లో శివరాత్రి పర్వ దినాల్లో అయితే శివుడికి అభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వెళ్తుంటారు.అయితే శివుడికి చాలా రకాల పదార్థాలతో అభిషేకాలు చేస్తుంటా.

కానీ దేనితో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో మాత్రం మనకు తెలియదు.అయితే దేని వల్ల శివ లింగానికి అభిషేకం చేస్తే.

ఏ ఫలితం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.తులసీ తీర్థంతో శివుడికి అభిషేకం చేస్తే మనశ్శాంతి కల్గుతుంది.

Advertisement

అలాగే పాలుతో  దీర్ఘాయువు లభిస్తుంది. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది.

చక్కెరతో చేయడం వల్ల శత్రుజయం కల్గుతుంది.తేనెతో అభిషేకిస్తే.

విద్యా, సంగీత వృద్ధి సిద్ధిస్తుంది.నెయ్యితో స్వర్ణార్హత, పన్నీరుతో సకల ఐశ్వర్య ప్రాప్తి, చందనంతో ధనాభి వృద్ధి, విభూదితో చేయడం వల్ల సర్వరోగ నివారిణి, నిమ్మరసంతో చేస్తే మరణ భయం పోతుంది.

అలాగే పంచామృతాలతో అభిషేకిస్తే.దేహదారుఢ్యం, పువ్వలుతో సుఖం, అరటి పళ్లతో వ్యవసాయం, అన్నంతో పెళ్లి, సౌభాగ్యం, పంచలోహ జలంతో మంత్ర సిద్ధి, కస్తూరితో కార్యసాఫల్యం, దానిమ్మరసంతో శత్రువశీకరణ, సుగంధ ద్రవ్యాలతో ఆయుర్దాయం కల్గుతాయి.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
Mummys Gold Review: How Mummys Gold Works And What Canadian Players Should Know

అయితే మానవుడు తన కోరికలను తీర్చుకునేందుకు భగవంతుడిని నవ విధాలుగా కొలుస్తున్నాడు.అయితే ఆ పరమ శివుడిని అభిషేకించడం ద్వారా.

Advertisement

స్మరించడం ద్వాలా ఆ భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.మీకు కావాల్సిందేదో తెలుసుకొని.

దానితో మాత్రమే శివాభిషేకం చేయడం ఉత్తమం అని వేద పండితులు సూచిస్తున్నారు.

" autoplay>