తెలుగు సినీ ప్రేక్షకులకు నటి స్టార్ హీరోయిన్ జయప్రద( Jayasudha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
కాగా జయసుధ నందమూరి తారక రామారావు సరసన సాంఘిక జానపద పౌరాణిక సినిమాలలో నటించి మెప్పించింది.దాదాపు ఎన్టీఆర్ తో 11 సినిమాలలో నటించింది.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.అయితే జయసుధ సినిమాల్లోకి రాక ముందు నుంచి ఎన్టీఆర్ అభిమాని.
ఒక అభిమానికి తన అభిమాన హీరో సరసన నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే.తన చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకుంటూ జయప్రద ఒక సందర్భంలో ఇలా చెప్పారు.నా అసలు పేరు లలితారాణి( Lalitharani ).నేను చిన్నప్పటి నుంచి రామారావుగారి వీరాభిమానిని.మా తమ్ముడు రాజబాబుతో కలసి ఎన్టీఆర్ శ్రీకృష్ణావతారం చిత్రాన్ని 18సార్లు చూశాను.అందులోని నీ చరణ కమలాల నీడనై చాలు.పాట తెగ నచ్చేసింది.ఇంటికి వచ్చాక పదే పదే ఆ పాట పాడుతూ డాన్స్ చేసేదాన్ని.
రామారావు గారిని కళ్ళారా చూడాలనే కోరిక రోజు రోజుకి పెరిగి పోయింది.ఆయన్ని చూపిస్తే తప్ప అన్నం తినననీ ఒకరోజు మొండికేశాను.
మా నాన్నగారికి సినిమావాళ్ళతో పరిచయాలు ఉండేవి.అందుకే నన్ను మద్రాస్ తీసుకెళ్లారు.సినిమా పేరు గుర్తులేదు కానీ రామారావు గారు షూటింగ్లో ఉంటే నన్ను తీసుకెళ్లారు.అంతవరకూ తెర మీద చూసిన ఎన్టీఆర్ ఎదురుగా కనిపించేసరికి ఆనందంతో నాకు నోట మాట రాలేదు.
రాజమండ్రి నుంచి తీసుకెళ్లిన పొలస చేపలు, మామిడిపళ్ళు నా చేతుల మీదుగా ఎన్టీఆర్కి ఇప్పించారు నాన్న.ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు.తనకోసం సిద్ధం చేసిన ఆపిల్ జ్యూస్నీ ఒక గ్లాస్లో పోసి ఇచ్చి తాగమన్నారు.ఇదంతా చూసి నేను ఎంత సంబరపడిపోయానో ఆ తర్వాత చాలాసార్లు రామారారు గారిని కలిశాను కానీ.
ఆయన్ని మొదటిసారి కలసిన రోజు మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది.అడవి రాముడు సినిమా షూటింగ్ ముదుమలైలో జరుగుతున్నప్పుడు ఒకరోజు ఈ సంఘటనని ఆయనకు చెప్పాను.
‘ఓసి.ఆ పిల్లవి నువ్వెనన్నమాట అని భుజం తట్టి పెద్దగా నవ్వేశారు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చింది జయసుధ.