తెలంగాణ లో టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చినప్పటి నుండి వరుసగా ఎన్నికల పై దృష్టి పెట్టిన ఈ ప్రభుత్వం కొంతైన విరామం లేకుండా ఎలక్షన్ల పక్రియను నిర్విరామంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే తెలంగాణ పుర పోరులో జనసేనకు ఎస్ఈసీ భారీ షాక్ ఇచ్చింది.
ఈ రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీలకు జరగనున్న ఎన్నికల పోటీలో పలు పార్టీల కామన్ గుర్తులను తొలగిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో జనసేన (గాజు గ్లాసు), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్), ఎంసీపీఐ (యూ), ( గ్యాస్ సిలిండర్), ఇండియన్ ప్రజా పార్టీ (ఈల), హిందుస్థాన్ జనతా పార్టీ (కొబ్బరి తోట) మొదలగు పార్టీలు కామన్ గుర్తులను కోల్పోయాయి.
ఇకపోతే గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీ చేయని నేపథ్యం లో ఈ పార్టీలు తమ కామన్ గుర్తును కోల్పోయాయట.