ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం(Garidepalli ) పొనుగోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి( Sarvepalli Radhakrishnan ) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలో తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ప్రధానోపాధ్యాయురాలు ఏచూరి నర్సకుమారి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులకు మాత్రమే ఉంటుందని,తాము అలాంటి గురువుస్థానంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉండదని సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో అత్యున్నత విలువలతో జీవిస్తూ తమ విద్యార్థుల అభివృద్ధికి నిస్వార్ధంగా కృషి చేసి, విద్యార్థుల పురోగతిని ఆశించే వారే ఉపాధ్యాయులని,సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితమే తమకు ఆదర్శనీయమన్నారు.ఈ కార్యక్రమంలో టీచర్స్ కట్ట శ్రీను,ప్రభాకర్,నిమ్మల శ్రీనివాస్,నగేష్, మణికుమారి,శ్రీనివాస్, కోటేశ్వరరావు,రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం : సిఎండి ముషారఫ్ పరూఖీ
Advertisement

Latest Suryapet News