ఏపీలో పలు కొత్త పరిశ్రమలు కొలువుదీరాయి.ఈ మేరకు కొత్త పరిశ్రమలను సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
రూ.1,072 కోట్లతో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు కాగా ఈ పరిశ్రమలతో సుమారు 21,079 మందికి ఉపాధి దొరకనుంది.పరిశ్రమల ప్రారంభోత్సవం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని తెలిపారు.కలెక్టర్లు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలని చెప్పారు.
పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని పేర్కొన్నారు.ఈ క్రమంలో ఆ దిశగా అడుగులు వేయాలని తెలిపారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 386 ఎంవోయూలు చేసుకున్నామన్నారు.రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నామన్న సీఎం జగన్ ఆరు లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.