టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో రఫ్ ఆడిస్తున్నాడు.ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.
అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.
అందుకే ఎలాగైనా ఆచార్యను మరిపించే హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ను సంతోష పరచాలని మెగాస్టార్ కోరుకుంటున్నాడు.ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.
పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ముగింపు దశకు చేరుకోవడంతో వరుస అప్డేట్ లను సిద్ధం చేస్తున్నారు మేకర్స్.
ఇటీవలే ఈ సినిమా నుండి మెగాస్టార్ లుక్ ను రివీల్ చేయబోతున్నట్టు ఒక పోస్టర్ వదిలిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా ఆడియో హక్కులు సోల్డ్ అయినట్టు ప్రముఖ సంస్థ ప్రకటించింది.
గాడ్ ఫాదర్ ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సౌత్ వారి భారీ ధరలకు సొంతం చేసుకున్నారు.ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసారు.ఇక నుండి గాడ్ ఫాదర్ నుండి ఏ సాంగ్ అప్డేట్ వచ్చినా సరిగమ నుండే వస్తుంది.
ఇక ఇది ఇలా ఉండగా.ఈ సినిమాలో చిరంజీవి కి తోడుగా సల్మాన్ ఖాన్, సునీల్, నయనతార, పూరీ జగన్నాథ్, అనసూయ ఇలా ఇంత మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించ బోతున్నారు.