తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటినుంచే గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది.ఇందులో భాగంగా ఏ నేత ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కీలక నేత అయినా బండి సంజయ్ అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు సమాచారం.
ఈ మేరకు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగనున్నారు.
నిన్నటి పర్యటనలో భాగంగా పోటీపై చర్చ జరిగిందని తెలుస్తోంది.పోటీ చేసే అంశంపై ఇప్పటికే క్యాడర్ కు సంతేకాలు ఇచ్చినట్లు సమాచారం.
అదేవిధంగా ఇప్పటికే సర్వే నిర్వహించుకున్న బండి సంజయ్… ఇక వారంలో ఒక్క రోజు కరీంనగర్ లోనే ఉండనున్నారు.