తెలుగు చిత్ర పరిశ్రమలో నటి సమీరా రెడ్డి నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈమె ఎన్టీఆర్ నటించిన అశోక్, నరసింహుడు సినిమాతో పాటు చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలలో మాత్రమే నటించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాలలో నటించి మెప్పించారు.ఇకపోతే సమీరా రెడ్డి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా సమీరారెడ్డి తన సినీ కెరియర్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు డెస్క్ జాబ్ చేస్తూ ఉండేవారట అయితే ఈమె 1998లో మొట్టమొదటిసారి ఆడిషన్స్ కోసం వచ్చారని తెలుస్తుంది.
మొదటిసారి మహేష్ బాబు హీరోగా నటిస్తున్న రాజకుమారుడు సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లారట.ఆడిషన్ కోసం వెళ్ళినటువంటి ఈమె చాలా భయం భయంతోనే ఉన్నారట.అయితే ఈ ఆడిషన్లో భాగంగా అక్కడ వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఈమె పూర్తి చేయలేక ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయానని తెలిపారు.
ఇలా తనకు సినిమాలు సెట్ కావనీ తాను ముందు ఏ జాబ్ అయితే చేస్తున్నానో అదే చేయాలని అనుకున్నారట.అయితే కొన్ని రోజుల తర్వాత మరింత ధైర్యం కూడగట్టుకొని మొదటిసారి ప్రైవేట్ ఆల్బమ్ కోసం కెమెరా ముందుకు వచ్చాను అంటూ సమీరా రెడ్డి ఈ సందర్భంగా అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.