టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ లలో సమంత కూడా ఒకరు.
కాగా సమంత ఇటీవలె యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇకపోతే గత కొంతకాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో ఆ వ్యాధి నుంచి కోలుకుంటోంది.అలాగే సినిమాలలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే సమంత నటించిన ఖుషి సినిమాతో పాటు సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్ ల షూటింగ్ లలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ఆ సినిమా మరోసారి వాయిదా పడింది.అయితే ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయాన్ని మాత్రం చిత్ర బృందం వెల్లడించలేదు.దీంతో ప్రస్తుతం సమంత తాను కమిట్ అయిన సినిమాలు వెబ్ సిరీస్ లను పూర్తి చేసే పనిలో పడింది.
ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ నిమిత్తం ఆమె ముంబైలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వెబ్ సిరీస్ కోసం ఎక్కువ రోజులు సమంత అక్కడే ఉండాల్సి వస్తుండడంతో అక్కడ ఇల్లును కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే 15 కోట్ల విలువైన విలాసవంతమైన ప్లాట్ ను చూసిందని ఆ ఫ్లాట్ ని కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే గతంలో కూడా ఈ విధంగానే నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె ముంబైకి మకాం మార్చాలని అనుకుంటుంది అంటూ జోరుగా వార్తలు వినిపించగా తనకు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉందని తాను ఇక్కడి నుంచి వెళ్ళను అని సమంత చెప్పకనే చెప్పిన విషయం తెలిసిందే.తాజాగా ఇదే విషయం మరోసారి తెరపైకి వచ్చింది.సిటాడెల్ వెబ్ సిరీస్ లో భాగంగా సమంత ముంబైకి వెళ్తుండగా ఆమె హైదరాబాద్ ను వదిలి వెళ్ళిపోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.