వచ్చే ఎన్నికలలో 175 నియోజకవర్గాలలో గెలుస్తామంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను వైసీపీ ప్రభుత్వం( YCP Government ) చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.

 Sajjala Ramakrishna Reddy Who Wants To Win In 175 Constituencies In The Next Ele-TeluguStop.com

నేతలను నిత్యం ప్రజలలో ఉండే రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఒకపక్క ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా.

లబ్ధిదారులకు చేరవేస్తున్నారు.అదేవిదంగా గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతానికి పైగా వైఎస్ జగన్( YS Jagan ) నెరవేర్చడం జరిగింది.

ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్ లు.జిల్లా అధ్యక్షులు సమావేశంలో.సజ్జల మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచే సత్తా వైసీపీకీ ఉందని స్పష్టం చేయడం జరిగింది.

ఇక ఇదే సమయంలో ఓటర్ల జాబితా సవరణలు అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.దొంగ ఓట్ల తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో చురుగ్గా ఉండాలి.

ఇదే సమయంలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి కూడా ఇంటింటికి అర్థమయ్యే రీతిలో వివరించాలి.అంతేకాదు వాలంటీర్ల పై ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లను కూడా తిప్పి కొట్టాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి( YCP Sajjala Ramakrishna Reddy ) పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube