రాష్ట్ర ప్రజల మూడు రాజధానుల ఆకాంక్ష నేరవేరాలి : సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్ర ప్రజల మూడు రాజధానుల ఆకాంక్ష నేరవేరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

 Sajjala Ramakrishna Reddy Visited Tirumala Temple ,sajjala Ramakrishna Reddy,tir-TeluguStop.com

దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేందాలని, సుభిక్షంగా ఉండాలని స్వామి వారి వేడుకోవడం జరిగిందని, కష్టాల కాలంలో‌ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని, ఏపికి రాష్ట్రంకు రావాల్సినవి అన్ని రావాలని, రాష్ట్ర ప్రజల మూడు ప్రాంతాల అభివృద్ధి ఆంక్ష, అధికార వికేంద్రీకరణ మూడు రాజధానులకు ఆటంకాలు తొలగి పోవాలని, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఎప్పటికైనా ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నట్లు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube