ఏపీలో ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ – జనసేన( TDP-Janasena ) అతుకుల బొంతని ఎద్దేవా చేశారు.
టీడీపీ, జనసేన అసంతృప్త నేతలు వైసీపీలోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు.అయితే నేతల ట్రాక్ రికార్డ్ పరిశీలించిన తరువాతే పార్టీలోకి చేర్చుకుంటామని తెలిపారు.
అంతేకానీ వచ్చిన వారందరినీ చేర్చుకోమని చెప్పారు.అలాగే రానున్న ఎన్నికలకు ఇప్పటికే గట్టి టీంను సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు.