టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు Teత్రలు చేస్తున్నారని విమర్శించారు.

రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.చంద్రబాబుకు ఏ విషయంపైనా క్లారిటీ లేదని పేర్కొన్నారు.

బీజేపీకి దగ్గర అవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.తెలంగాణలోని కాంగ్రెస్ స్లీపర్ సెల్స్ ను రావాలని పిలుస్తున్నారని వెల్లడించారు.

ఏపీ బీజేపీలోని స్లీపర్ సెల్స్ ను పిలవడం లేదన్నారు.చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్న సజ్జల రాజకీయంగా ఏదో ఒక ప్రయోగం చేసి తనకు తాను డిమాండ్ క్రియేట్ చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు