టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు.
కందుకూరు, గుంటూరు ఘటనలకు చంద్రబాబు బాధ్యత వహించాలని తెలిపారు.నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు చనిపోయే వారు కాదని చెప్పారు.
రోడ్లపై సభలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ క్రమంలో రోడ్లపై సభలు పెట్టొద్దనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని సజ్జల స్పష్టం చేశారు.పోలీస్ యాక్ట్ కు లోబడే ప్రభుత్వం జీవో తెచ్చిందని తెలిపారు.
కానీ చట్టాలను పట్టించుకోనని, ఏం చేసుకుంటారో చేసుకోండని బాబు అంటున్నారని విమర్శించారు.