టాలీవుడ్ యంగ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష( Virupaksha ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.
దీంతో సాయిధరమ్ తేజ్ తో పాటు చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర బృందానికి పలువురు ప్రముఖులు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఇంత సక్సెస్ అయిన సందర్భంగా అభిమానులకు థాంక్స్ చెప్పడానికి ట్విట్టర్ లో తాజాగా చిట్ చాట్ సెషన్ ను నిర్వహించారు సాయి ధరమ్ తేజ్.
ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ లో #AskSDT అని చెప్పగా అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డౌట్లను చెప్పి క్లారిఫై చేసుకున్నారు.ఇక అభిమానులు అడిగే ప్రశ్నలకు సాయి ధరమ్ తేజ్ ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు.ఇందులో భాగంగానే చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించారు.
మీరు బతికాలని తెలియగానే చిరంజీవి గారు కళ్ళలో మీరు చూసిన ఫీలింగ్ ఏంటి చెప్పండి అని ప్రశ్నించగా.కొన్ని కొన్ని అనుభవించాలి అంతే చెప్పలేం అని తెలిపారు సాయి ధరమ్ తేజ్.
అనంతరం పవన్,( Pawan kalyan ) మీరు కలిసి నటిస్తున్న వినోదయ సీతం రీమేక్ ( Vinodhaya Sitham)టైటిల్ లీక్ చేయొచ్చుగా అని ఒక అభిమాని ప్రశ్నించగా.
స్పందించిన సాయి ధరమ్ తేజ్ నీకేం పోయింది.తేజు గారు అనే ఫోన్ కాల్ వస్తుంది అని తెలిపాడు సాయి ధరమ్ తేజ్.సాయి ధరమ్ తేజ్ తేజు గారు అని ప్రస్తావించడం పట్ల అర్థం మనందరికీ తెలిసిందే.
పవన్ కళ్యాణ్ విరూపాక్ష సినిమా సక్సెస్ అయిన సందర్భంగా బొకే పంపుతూ తేజు గారు కంగ్రాట్స్ అని రాసిన విషయం తెలిసిందే.తాజాగా తేజు గారు అని మళ్లీ రిపీట్ చేయడంతో ఏంటి తేజు మామపై సెటైర్ వేసావా లేక ఇమిటేట్ చేసావా అంటూ అభిమానులు సరదాగా ఆటపట్టిస్తూ సాయి తేజ్ ని బుక్ చేస్తున్నారు.