వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సైంధవ్.ఈ సినిమా టీజర్ తోనే సర్ ప్రైజ్ చేయగా సినిమా కచ్చితంగా దగ్గుబాటి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందించేలా ఉంటుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుండగా ఒక హీరోయిన్ గా రుహాని శర్మ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.చిలసౌ సినిమాలో తన పాత్రతో ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరైన రుహాని శర్మ హిట్, డర్టీ హరి సినిమాల్లో నటించింది.
అవసరాల శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలో నటించింది.ప్రస్తుతం హర్ అనే సినిమాలో నటిస్తున్న అమ్మడు వెంకటేష్ సైంధవ్ లో ఛాన్స్ అందుకుంది.మెడికల్ మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తుండగా అందులో ఒకరు రూహాని ఫిక్స్ అయ్యింది.మిగతా ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
శైలేష్ మాత్రం హిట్ సీరీస్ తరహా లోనే సీరియస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.సైంధవ్ సినిమాలో వెంకటేష్ చాలా కాలం తర్వాత సీరియస్ యాక్షన్ మోడ్ లో కనిపించునున్నారు.
మరి వెంకీ తో శైలేష్ కొలను ఎలాంటి సినిమా అందిస్తాడో చూడాలి.