దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ రావు బోయిన్ పల్లి బెయిల్ రద్దు పిటిషన్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దాఖలైన పిటిషన్లపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 11 కు వాయిదా వేసింది.