ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ నీ గాని ఆయన కుటుంబ సభ్యులను గాని విమర్శిస్తే నాలుక కోసి ఉప్పు కారం పెడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఓ బైక్ ర్యాలీలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఎన్టీఆర్ పై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని తెలిపారు.
రాష్ట్రంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత వైసీపీ దేనని అన్నారు.
తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడు లాంటి వాళ్లు సైకోలుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు.
అలాంటి నాయకులను త్వరలో పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయకపోతే ప్రజలే రాళ్లతో కొట్టి చంపేస్తారని.టీడీపీ నాయకులకు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వింటే ఆయన వయసుకు గాని ఆయన అధిరోహించిన పదవులకు గాని గౌరవం ఇవ్వలేకపోతున్నామని.తెలిపారు.
రాజకీయపరంగా సమస్యలు దొరకలేదని జగన్ కుటుంబంపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని రోజా వార్నింగ్ ఇచ్చారు.