బీసీసీఐ తాజాగా దక్షిణాఫ్రికా టూర్ ( South Africa tour )వెళ్లే భారత జట్లను ప్రకటించింది.దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడే భారత జట్టుకు రోహిత్ శర్మ, వన్డే సిరీస్ ఆడే భారత జట్టుకు కేఎల్ రాహుల్, టీ20 సిరీస్ ఆడే భారత జట్టుకు సూర్య కుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నారు.
భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ వన్డే, టీ20ల నుంచి విరామం తీసుకుని భారత టెస్టు జట్టుకు మాత్రమే నాయకత్వం వహించనున్నాడు.భారత జట్టు రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా జరిగే వన్డే, టీ20ల నుంచి విరామం తీసుకుని టెస్టు సిరీస్ లో మాత్రమే ఆడనున్నాడు.
దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్లు ఆడే భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది అవి ఏమిటో చూద్దాం.
దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టెస్టు జట్టు
: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్థూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత వన్డే జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష దీప్ సింగ్, దీపక్ చహర్.

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టీ20 జట్టు
: యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ,సూర్య కుమార్ యాదవ్(కెప్టెన్) రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, అర్ష దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, దీపక్ చహార్.







