రేణు దేశాయ్ నటించింది రెండు సినిమాల్లోనే అయినా ఆమె పవన్ కళ్యాణ్ భార్య అవ్వడం వల్ల విపరీతమైన ఫాలోయింగ్ ని దక్కించుకుంది.పవన్ నుండి విడిపోయిన తర్వాత కూడా ఆమెను నెటిజన్స్ ఫాలో అవుతూనే ఉన్నారు.
ఆమె ఏం చేసినా కూడా నెటిజెన్స్ మరియు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తూ ఉంటారు.ఆ మధ్య పూణే నుండి హైదరాబాదు మకాం మార్చిన రేణు దేశాయ్ తెలుగులో వరుసగా సినిమాల్లో నటించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.
కానీ గత ఆరేడు నెలలుగా కరోనా కారణంగా ఆమె షూటింగ్ లకు హాజరు కాలేదు.ఎట్టకేలకు దసరా నుండి ఆమె కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది అని తెలుస్తోంది.
మొదట ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించబోతుంది.ఆ తర్వాత వరుసగా సినిమాల్లో కూడా నటిస్తుందని సమాచారం అందుతోంది.
మొత్తానికి దసరా రోజున రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సందర్భంగా అంతా కూడా ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. రీ ఎంట్రీ తో అయిన సినిమాలు చేయాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వెబ్ సిరీస్ తో మరియు బుల్లి తెరపై ఆమె ఇప్పటికే సందడి చేసేందుకు రెడీ అయింది.సినిమాల్లో త్వరలోనే ఆమె నటిస్తుందని అంతా ఆశిస్తున్నారు.ఆమధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించబోతున్న ఒక సినిమాలో కీలక పాత్రకు ఆమెను ఎంపిక అయిందని వార్తలు వచ్చాయి.కానీ అది నిజం కాదని క్లారిటీ ఇచ్చింది.2022 వరకు అయినా ఆమె నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆమెను ఫాలో అవుతున్న వారు నమ్ముతున్నారు.మహేష్ బాబు ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ చెప్పింది.
ఆ కారణంగా ఆమెను తమ కథలతో ఒప్పించేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు.