టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్ మహేష్ బాబు సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే ఈ హీరోల ఫ్యాన్స్ మాత్రం తాజాగా గొడవ పడటం ద్వారా వార్తల్లో నిలిచారు.
ట్విట్టర్ లో ప్రభాస్ మహేష్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు.అటు బెంగళూరులో ఇటు హైదరాబాద్ లో లొకేషన్స్ షేర్ చేసుకుని ఫ్యాన్స్ గొడవ పడటం గమనార్హం.
తాము చెప్పిన మాల్స్, థియేటర్ వద్దకు రావాలని ఫ్యాన్స్ ఒకరినొకరు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
అవతలి వ్యక్తులు రాకపోవడం వల్ల గొడవ జరగలేదు కానీ వచ్చి ఉంటే మాత్రం పెద్ద గొడవ జరిగేది.
ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫ్యాన్స్ గొడవ పడుతుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ విధంగా గొడవ పడటం ఇదే తొలిసారి కాదు.
గతంలో కూడా పలువురు హీరోల ఫ్యాన్స్ గొడవలు పడిన సందర్భాలు అయితే ఉన్నాయి.ప్రభాస్ మహేష్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ఏకంగా ఏడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఎప్పుడు ఏ సినిమాను రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు.బాలీవుడ్ డైరెక్టర్లు సైతం ప్రభాస్ తో సినిమాలు చేయడానికి క్యూ కడుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.మహేష్ విషయానికి వస్తే త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో బిజీగా ఉన్నారు.
ప్రభాస్, మహేష్ రాబోయే రోజుల్లో వీళ్లిద్దరూ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయి.ఇలాంటి తరుణంలో ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ గొడవ పడటం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఈ గొడవల విషయంలో హీరోలు జోక్యం చేసుకుంటే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.