బాలకృష్ణ రాధిక కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి గల కారణమేంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఈ మధ్య కాలంలో చిరంజీవి బాలకృష్ణ మంచి స్నేహితులు అయ్యారని ఆయన కామెంట్లు చేశారు.
చిరంజీవి గారితో రాధిక ఎక్కువ సినిమాలు చేశారని ఇమంది రామారావు పేర్కొన్నారు.
బాలకృష్ణ గారు తన సినిమాలలో ఎప్పుడూ మంచి హీరోయిన్లను ఎంపిక చేసుకునేవారని హీరోయిన్ల విషయంలో బాలయ్య సెలెక్టివ్ గా ఉంటారని ఆయన కామెంట్లు చేశారు.
బాలయ్య కావాలని అనుకోలేదని ఆ రీజన్ వల్లే బాలయ్య రాధిక కాంబినేషన్ లో ఉన్న సినిమా రాలేదని రామారావు కామెంట్లు చేశారు.బాలయ్య విజయశాంతి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు వచ్చాయని రామారావు అన్నారు.
స్టార్ హీరో చిరంజీవి వల్లే బాలయ్య రాధిక కాంబినేషన్ లో సినిమా రాలేదా అనే ప్రశ్నకు ఇమంది రామారావు కాదనే సమాధానం చెప్పారు.అలా జరిగే ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు.
అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో కాంబినేషన్ తనను ఆకట్టుకుందని ఆయన చెప్పుకొచ్చారు.సీరియస్ పొలిటీషియన్స్ ను షోకు తీసుకురావడం సంతోషం కలిగించిందని ఇమంది రామారావు వెల్లడించారు.
బాలయ్య నూటికి నూరు శాతం ఎనర్జీ ఇస్తారని ఆయన తెలిపారు.
అన్ స్టాపబుల్ షో నెక్స్ట్ లెవెల్ లో ఉంటోందని చిరంజీవి, పవన్ కళ్యాణ్, జయసుధ ఈ షోకు వచ్చే ఛాన్స్ వచ్చిందని ఇమంది రామారావు పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో క్రేజ్ ఉన్న గెస్ట్ లు ఈ షోకు హాజరు కానున్నారని ఆయన కామెంట్లు చేశారు.ఇమంది రామారావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.