సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా మొదటి మూడురోజుల పాటు కలెక్షన్లకు ఢోకా ఉండదు.అయితే ఆచార్య సినిమాకు మాత్రం సినిమా రిలీజ్ రోజున మార్నింగ్ షో నుంచి నెగిటివ్ టాక్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.
అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ కావడం వెనుక షాకింగ్ రీజన్ వెలుగులోకి వచ్చింది.అయితే కొన్ని మీడియా ఛానెళ్ల వల్ల అతి వల్లే ఆచార్య ఫ్లాప్ అయిందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు కావాలని నెగిటివ్ ప్రచారం చేశారు.ఆ మీడియా సంస్థలు మెగా హీరోలను టార్గెట్ చేశాయో లేక కొరటాల శివను టార్గెట్ చేశాయో తెలియదు కానీ నష్టం మాత్రం ఆచార్య సినిమాకు జరిగింది.
ఆచార్య సినిమా విషయంలో మీడియా సంస్థలు నెగిటివ్ ప్రచారం చేయకుండా ఉండి ఉంటే సినిమా ఫలితం మాత్రం తప్పనిసరిగా మరింత మెరుగ్గా అయితే ఉండేదని చెప్పవచ్చు.
ఆచార్య సినిమా బయ్యర్లకు 80 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగులుస్తోందని తెలుస్తోంది.
ఈ నష్టాల భర్తీకి సంబంధించి క్లారిటీ చూడాల్సి ఉంది. ఆచార్య మేకర్స్ పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతమేర నష్టాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
నష్టాల భర్తీ ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు కొంతమేర ఊరట కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఆచార్య సినిమా అటు మెగాస్టార్ కెరీర్ పై ఇటు కొరటాల శివ కెరీర్ పై ప్రభావం చూపింది.అయితే చిరంజీవి తర్వాత సినిమా గాడ్ ఫాదర్ రీమేక్ కావడంతో ఆ సినిమాపై ఆచార్య ప్రభావం పడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఆచార్య ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు పరిమితమైంది.
ఆచార్య సినిమా కలెక్షన్ల విషయంలో మెగా ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు.ఆచార్య లాంటి రొటీన్ కథలకు మెగాస్టార్ దూరంగా ఉండాల్సి ఉంది.