ఓ నేరస్థుడు తన పాత ఫోన్లో కొత్త సిమ్ కార్డు వేసి అడ్డంగా బుక్కయ్యాడు.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో సదరు నేరస్థుడి అతితెలివికి పోలీసులు ఎలా చెక్ పెట్టారో నిదర్శనగా నిలిచింది.
నాలుగేళ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ప్రబుద్ధుడు పరారీలో ఉన్నాడు.కాగా తాజాగా అతడి పాత ఫోన్ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి షాక్ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో నివసించే ఓ బాలికపై నాలుగేళ్ల క్రితం దర్జీ దుర్గారావు(45) అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
కాగా బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా దుర్గారావు పరారయ్యాడు.మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకున్నాడు.
అయితే నాలుగేళ్లు గడవడంతో పోలీసులు ఈ కేసును మర్చిపోయి ఉంటారిన భావించి, దుర్గారావు తన స్వగ్రామమైన జంగారెడ్డిగూడెంకు చేరుకున్నాడు.ఈ క్రమంలో తన పాత్ ఫోన్లో కొత్త సిమ్ కార్డు వేసుకున్నాడు.
ఇక్కడే మనోడి అతితెలివి బయటపడింది.ఫోన్ ఐఎంఈఐ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించారు.
దీంతో ఎస్ ఉదయ్ నేతృత్వంలోని పోలీసు బృందం జంగారెడ్డిగూడెం వెళ్లి జగ్గారావును అరెస్ట్ చేశారు.అతడిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఏదేమైనా జగ్గారావు అతితెలివికి పోలీసులు భలే చెక్ పెట్టారంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.