టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి తన నటనతో యావత్ ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన మొదటి సినిమా లీడర్.
ఈ సినిమాతోనే ఈయన దగ్గుబాటి వారసుడిగా మొదటిసారి వెండి తెరకు పరిచయామ్ అయ్యాడు.ఈయన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విభిన్నమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.
రానా ఏ సినిమాలో నటించిన ఆ పాత్రకు మంచి గుర్తింపు రావడమే కాకూండా ఈయనకు ఇమేజ్ పెరుగుతుంది.దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమాతో రానా వరల్డ్ వైడ్ గా మరింత గుర్తింపు తెచ్చుకుని స్టార్ట్ నటుడిగా పిలిపించు కుంటున్నాడు.
ఇటీవలే పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాలో రానా విలన్ గా నటించి హీరో పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు రానా నటించిన విరాట పర్వం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది.వేణు ఉడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా రిలీజ్ చేయకుండా ఆపారు.
ఇక ఎట్టకేలకు ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు మేకర్స్.
ఈ సినిమా ట్రైలర్ జూన్ 5న లాంచ్ చెంసేందుకు రెడీ అయ్యారు.రేపు కర్నూల్ లో గ్రాండ్ ఈవెంట్ నడుమ రిలీజ్ చేస్తున్నట్టు సురేష్ ప్రొడక్షన్స్ వారు సోషల్ మీడియా వేదికగా అఫిషియల్ గా ప్రకటించారు.దీంతో ఫ్యాన్స్ ఈ వేడుక కోసం రెడీ అవుతున్నారు.కాగా ఈ సినిమాలో రానా కు జోడీగా సాయి పల్లవి నటించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
నక్సల్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.