మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇకనుంచి పారితోషికం తీసుకోడు అంట! దీనికి కారణం బ్రూస్ లీ ఘోరంగా దెబ్బ తినడమే.20 కోట్ల నష్టాలతో బాక్సాఫీస్ వద్ద బ్రూస్ లీ భారి డిజాస్టర్ గా నిలవడంతో రామ్ చరణ్ పునరాలోచనలో పడ్డాడు.బడ్జెట్ పెరగడానికి తన పారితోషికం కూడా కారణం కావడంతో ఇక నుంచి పారితోషికం తీసుకోకూడదు అని నిశ్చయించుకున్నాడట చరణ్.అలాగని సినిమాలు ఫ్రీగా చేయడండోయ్.
రామ్ చరణ్ కి అందాల్సిన డబ్బు అందుతుంది.కాని పారితోషికం రూపంలో కాదు.
కుదిరితే లాభాల్లోంచి , లేదంటే సాటిలైట్ రైట్స్ తీసుకుంటాడు చరణ్.బాలివుడ్ లో ఇప్పటికే ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇదే పద్ధతిని పాటిస్తున్నారు.
తెలుగులో ఈ పద్ధతి అవలంబించబోతున్న తొలి అగ్రహీరో రామ్ చరణ్.
నిజానికి ఇది మంచి పద్ధతి.
బడ్జెట్ ఎంత తక్కువైతే అంత తక్కువ బిజినెస్ జరుగుతుంది.బిజినెస్ ఎంత తక్కువ జరిగితే అంత ఎక్కువ లాభాలు వస్తాయి.
ఒకవేళ సినిమా ఫ్లాప్ అయునా, నష్టాలు తక్కువగా ఉంటాయి.