'నా ఫరెవర్ మెమొరీలో ఇది ఒకటి'.. చరణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతి త్వరలో జరగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.

అప్పటి నుండి యూఎస్ లో చరణ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో చార్ట్ బస్టర్ గా నిలిచినా సాంగ్ నాటు నాటు.

వరల్డ్ వైడ్ గా పలు ఇంటర్నేషనల్ సినిమాల పాటలతో పాటు మన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కూడా ఎంపిక అయ్యింది.దీంతో ఈ సినిమా తరపున టీమ్ అంతా ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొనబోతుంది.

మార్చి 12న జరగనున్న ఈ ఈవెంట్ కోసం చరణ్ కూడా తన సినిమా షూట్ కు బ్రేక్ ఇచ్చి అమెరికా వచ్చారు.

Advertisement

ఈ క్రమంలోనే చరణ్ అక్కడ కూడా ఫ్యాన్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.నిన్న యూఎస్ లో ఉన్న ఏస్ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కు కూడా హాజరయ్యారు.మొత్తంగా 1647 సీటింగ్ కెపాసిటీతో ప్లాన్ చేసిన మాసివ్ స్క్రీనింగ్ కు చరణ్ కూడా హాజరయ్యాడు.

ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ అందుకున్న చరణ్ ఆ షోలో తాను పొందిన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఏస్ హోటల్లో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కు మీరు ఏమన్నా రెస్సాన్స్ ని ఇచ్చారు.మా సినిమాకు అంతా నిలబడి చప్పట్లతో గౌరవించడం అనేది నా ఫేవరేట్ మెమొరీలలో ఒకటిగా మిగిలి పోతుంది అని చరణ్ పోస్ట్ చేయగా ఇది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళి అండ్ టీమ్ కలిసి తీసుకున్న బ్యూటిఫుల్ సెల్ఫీను కూడా షేర్ చేసాడు.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు