కరోనా బారినపడిన మరో సీయం.. !

దేశంలో కరోనా ఎవరిని వదిలి పెట్టడం లేదు.ఈ విషయం తెలిసి కూడా ఎన్నికలు అంటూ నేతలు కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు.

ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఊహించని స్దాయిలో నమోదవుతుండటంతో ఆందోళన మొదలైంది.ఇకపోతే కోవిడ్ బారిన సామాన్యులతో పాటుగా, రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు.

సుమారుగా అన్ని రాష్ట్రాల నేతలకు ఇప్పటికే కోవిడ్ నిర్ధారణ జరిగింది కూడా.ఇక మరికొందరు మరణించారు.

ఇదిలా ఉండగా తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా అశోక్ గెహ్లట్‌ వెల్లడించారు.

Advertisement

కాగా కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని, అయితే ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా తప్పని సరిగ్గా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ఇకపోతే గెహ్లాట్ భార్య సునీత‌కు కూడా నిన్న బుధ‌వారం క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు