విదేశీ పర్యటనకు సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక..!!

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం మరోసారి విదేశాలకు వెల్లబోతున్నారు.

ఈ క్రమంలో ఆమెకు తోడుగా రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా వెళ్లనున్నారు.

ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించడం జరిగింది.గత కొంతకాలంగా సోనియాగాంధీ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

కరోనా బారిన పడటం కూడా జరిగింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత జైరామ్  రమేష్ తెలియజేస్తూ.

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి సోనియా గాంధీతో పాటు రాహుల్ మరియు ప్రియాంక గాంధీ తోడుగా విదేశాలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.ఇంకా సెప్టెంబర్ 4వ తారీఖు ఢిల్లీలో జరిగే.

Advertisement

"మేహంగాయ్ పర్ హల్లా బోల్" ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తారని చెప్పుకొచ్చారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నిక జరగనుంది.

ఇక వచ్చే నెల మొదటి వారంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ జొడో యాత్ర జరగనుంది.ఇటువంటి పరిస్థితుల మధ్య సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ మరియు రాహుల్ విదేశీ పర్యటన చేపట్టటం సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు