కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టును ఆశ్రయించనున్నారు.ఈ నేపథ్యంలో రేపు ఆయన సూరత్ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
మేజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలని సెషన్స్ కోర్టును రాహుల్ గాంధీ కోరిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేసు తేలే వరకు శిక్షపై మధ్యంతర స్టే విధించాలని పిటిషన్ లో కోరారు రాహుల్ గాంధీ.
కాగా పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడటంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దైన సంగతి తెలిసిందే.