రాధేశ్యామ్ డూప్ సీన్స్.. ఇక్కడ ఉన్నది ఎవరో చెప్పండంటూ దారుణమైన ట్రోల్స్?

బాహుబలి చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో ఎంతో బిజీగా మారిపోయారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు.

ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది సినిమాపై అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే సాహో చిత్రం తర్వాత ప్రభాస్ సినిమా ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ప్రేమ కథ చిత్రంగా ఉండబోతుందని వెల్లడించారు.ఇకపోతే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పలు భాషలలో ఒకేరోజు విడుదల కానుంది.

Advertisement

ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు వివిధ రకాలుగా ఈ ఫోటో పై స్పందిస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ ఆ ఫోటోల లో ఏముంది అనే విషయానికి వస్తే.

ఇందులో హీరో హీరోయిన్లు నీలిరంగు డ్రెస్సులను ధరించి బండి పై వెళ్తున్నారు.అయితే ఇది సినిమాలోని ఒరిజినల్ సీన్ కాకుండా డూప్ సీన్ కావడంతో ఈ ఫోటోలో పూజా హెగ్డే ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కనుక్కోండి చూద్దాం? అంటూ ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే కొందరు నెటిజనులు ఈ ఫోటో పై స్పందిస్తూ విభిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

అలాగే ఈ ఫోటో పై మీమ్స్ కూడా రావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఇందులో పూజా హెగ్డే ప్లేస్ లో ఉన్నది మెగా డాటర్ నిహారిక లాగా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఒలిలియో అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరికొందరైతే అక్కడ బండి నడుపుతున్నది కూడా ప్రభాస్ కాదంటూ కామెంట్ చేస్తున్నారు.ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ ఫోటో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

మరికొందరైతే ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే కన్నా ఈమె అందంగా ఉంది అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

మొత్తానికి రాధేశ్యామ్ డూప్ సీన్ కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నారు.

అదే విధంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నారు.ఇవే కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాని కూడా అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.

తాజా వార్తలు