వామ్మో రాధేశ్యామ్ డైరెక్టర్ మామూలోడు కాదుగా... నిజంగానే అలా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాతో దర్శకుడు రాధాకృష్ణ నేషనల్ వైడ్ గా ఫేమస్ కానున్నాడు.

రాధేశ్యామ్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే దర్శకుడు రాధాకృష్ణ పేరు మార్మోగిపోతోంది.అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే రాధేశ్యామ్ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదల అయి ఉండేది.

కానీ ఊహించని విధంగా కరోనా వైరస్ కారణంగా లెక్కలన్నీ తారుమారయ్యాయి.కరోనా వైరస్ కారణంగా రాధేశ్యామ్ సినిమా విడుదల తేదీ మళ్లీ వాయిదా పడింది.

Advertisement

అయితే విడుదల తేదీ ని ఎప్పుడు అన్నది ప్రకటించలేదు.అందుకు గల కారణం ఈ కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయి అని ఎవరూ చెప్పలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు రాధాకృష్ణ తన అభిమానులతో చిట్ చాట్ చేశారు.ఈ క్రమంలోనే తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మీరు ప్రభాస్ ని ఏమని పిలుస్తారు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా.సార్ అని పిలుస్తాను అంటూ సమాధానమిచ్చారు.

సినిమాలో పూజా హెగ్డే ఏ విధంగా నటించింది.అందుకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు.రాధాకృష్ణ సమాధానమిస్తూ పూజా హెగ్డే తనకు తానే సాటి అనేలా నటించారు అని చెప్పుకొచ్చారు.

ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?
ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారా?

ఈ సినిమా గురించి ఒక్క పదంలో చెప్పండి అని నెటిజెన్ ప్రశ్నించగా.లవ్ అంటూ ఈ సినిమా గురించి ఒక్క పదంలో వర్ణించాడు దర్శకుడు.

Advertisement

లవ్ ఫెయిల్యూరా? మామా నువ్వు.ఒకవేళ కాకపోతే ఎంత మందిని పడేసావ్ చెప్పు టిప్స్ ఏమైనా ఉంటే ఇవ్వు అని అడగగా.దానికి రాధాకృష్ణ సమాధానమిస్తూ అన్నీ పాసయ్యాను అదే నా ప్రాబ్లం అంటూ కన్ను కొట్టే ఏమోజి షేర్ చేశాడు.

రాధాకృష్ణ ఇచ్చిన ఆన్సర్ ని బట్టి చూస్తే రాధాకృష్ణ నిజంగానే కృష్ణుడు అయిపోయాడు.

తాజా వార్తలు